ధర్మపురిలో ఘనంగా యజ్ఞోపవీతధారణ

ABN , First Publish Date - 2022-08-13T06:00:00+05:30 IST

ధర్మపురి క్షేత్రంలో యజ్ఞోపవీత ధారణ కార్యక్ర మాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ధర్మపురిలో ఘనంగా యజ్ఞోపవీతధారణ
ధర్మపురిలో నిర్వహిస్తున్న యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం

ధర్మపురి, ఆగస్టు 12: ధర్మపురి క్షేత్రంలో యజ్ఞోపవీత ధారణ కార్యక్ర మాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అన్నపూర్ణ సత్రంలో వేద పం డితులు మదు రామశర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మ ధ్య కలశ గణపతి పూజ, పృథ్విపూజ, పుణ్యహవచనం, పంచ గవ్య ప్రాశ నం, ఉపాకర్మ ఉత్సవం జరిపారు. అనంతరం వేద బ్రాహ్మణులు నూతన యజ్ఞోప వీతాధారణ చేశారు. అలాగే శ్రీ వేంకటేశ్వర ఆలయం ఆవరణలో అర్చకులు, శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి కులస్థులు య జ్ఞోప వీతాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల య ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, పట్టణ బ్రాహ్మణ సే వా సంఘం అధ్యక్షులు ఇందారపు రామయ్య, ప్రధాన కార్యదర్శి నందగిరి గిరిధర్‌, సంగనభట్ల దినేష్‌, పద్మశాలి సేవా సంఘం పట్టణ శాఖ అధ్య క్షులు నరేందర్‌, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌, మ్యాన రాజ య్య, కొంక రాంచంద్రం, నాగభూషణం పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T06:00:00+05:30 IST