వైసీపీ పాలన అవినీతి, అరాచకం: యనమల

ABN , First Publish Date - 2021-07-28T16:04:45+05:30 IST

వైసీపీ పాలన అవినీతి, అరాచకమని యనమల రామకృష్ణుడు విమర్శించారు.

వైసీపీ పాలన అవినీతి, అరాచకం: యనమల

విజయవాడ: వైసీపీ పాలన అవినీతి, అరాచకమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేవినేని ఉమ కారుపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల దోపిడీకి అదుపు లేకుండా పోతోందన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కనుసన్నల్లోనే వేల కోట్ల గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటే హత్యాయత్నానికి పాల్పడతారా? అంటూ ప్రశ్నించారు. దాడులు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. వైసీపీ నేతల సహజవనరుల దోపిడీపై టీడీపీ పోరాటం ఆగదని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-28T16:04:45+05:30 IST