బీసీలను మోసగిస్తున్న జగన్: యనమల
ABN , First Publish Date - 2022-04-11T20:48:10+05:30 IST
బీసీల్లో నలుగురికి మంత్రి పదవులిస్తే.. బీసీలందరికీ మేలు జరుగుతుందా? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
అమరావతి: బీసీల్లో నలుగురికి మంత్రి పదవులిస్తే.. బీసీలందరికీ మేలు జరుగుతుందా? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించారన్నారు. సంక్షేమ పథకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. టీడీపీ ఏర్పడక ముందు బీసీలకు గుర్తింపే లేదన్నారు.రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి..బీసీలకు జగన్రెడ్డి అన్యాయం చేశారని మండిపడ్డారు.బీసీల నిధులను జగన్రెడ్డి దారి మళ్లిస్తున్నారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.