Yarapatineni: ఆ వర్గమే కొడాలి నాని మంత్రి పదవి పోవటానికి ప్రధాన కారణం..
ABN , First Publish Date - 2022-09-13T18:14:05+05:30 IST
సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్న సీఎం జగన్ను సమాజం నుంచి వెలివేయాలని యరపతినేని అన్నారు.
అమరావతి (Amaravathi): దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ.. సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)ని సమాజం నుంచి వెలివేయాలని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ (Yarapatineni Srinivas) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కొడాలి నానికి వైసీపీలోని ఓ వర్గంతోనే ప్రమాదం పొంచి ఉందని.. ఆ వర్గమే కొడాలినానికి మంత్రిపదవి పోవటానికి ప్రధాన కారణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాదం ఉందని సంకేతాలిస్తూ వైసీపీ వర్గమే కొడాలినానికి ముప్పు కలిగిస్తోందన్నారు. సైకోలా మారిన జగన్మోహన్ రెడ్డి మానసిక వేదనతో చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని కించపరిచేలా కొందరితో మాట్లాడించి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. సీఎం పెంచి పోషించిన కొన్ని ఊర కుక్కలు నీతి, జాతి లేకుండా మొరుగుతున్నాయన్నారు. మునిసిపాలిటీ వాళ్ళు ఊరకుక్కల్ని ఏం చేస్తారో, జగన్ ప్రోత్సహిస్తున్న ఊరకుక్కలను ప్రజలు కూడా అదే చేస్తారన్నారు.
బాబాయ్ వివేకా హత్య కేసులో సీబీఐ వాస్తవాలు బయటపెడితే జగన్ పరిస్థితి ఏంటో ఆలోచించాలని యరపతినేని అన్నారు. అన్ని వాస్తవాలు బయటకొచ్చాక హిట్లర్ ఏం చేసుకున్నాడో సీఎం జగన్కు అదే గతి పడుతుందన్నారు. అనవసరంగా నోరు పారేసుకునే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్న రైతుల పోరాటానికి కులం అంటగట్టడం దుర్మార్గమన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించింది ఉత్తరాంధ్ర దోపిడీ కోసమేనని యరపతినేని శ్రీనివాస్ అన్నారు.