బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న Yashwant Sinha
ABN , First Publish Date - 2022-07-02T17:29:57+05:30 IST
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), టీఆర్ఎస్ (TRS) మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్... సీఎం కేసీఆర్తో కలిసి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుండి బైక్ ర్యాలీ మొదలైంది. బైక్ ర్యాలీలో యశ్వంత్ సిన్హా, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎయిర్పోర్టు నుంచి జలవిహార్ వరకు పదివేల మందితో టీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది.