2న హైదరాబాద్‌కు రానున్న యశ్వంత్ సిన్హా

ABN , First Publish Date - 2022-07-01T22:17:59+05:30 IST

Hyderabad: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా 2న హైదరాబాద్‌కు వస్తున్నారు. సిన్హా పర్యటన వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వివరించారు.

2న హైదరాబాద్‌కు రానున్న యశ్వంత్ సిన్హా

Hyderabad: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జూలై 2వ తేదీ హైదరాబాద్‌కు వస్తున్నారు. సిన్హా పర్యటన వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వివరించారు. 

     

       ‘‘యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్‌కు వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. బేగంపేట, సోమాజిగూడా, రాజ్ భవన్ రోడ్ మీదుగా నెక్లెస్ రోడ్‌లోని జలావిహార్‌కు చేరుకుంటారు. అక్కడ సీఎం అధ్యక్షతన సమావేశం ఉంటుంది. అనంతరం అక్కడే యశ్వంత్ సిన్హా, సీఎం కలిసి లంచ్ చేస్తారు.’’ అని తలసాని పేర్కొన్నారు. 

తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు

     ‘‘నిన్న మహారాష్ట్ర, మొన్న కర్ణాటక, గోవాలో ఏమైందో ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని తలసాని పేర్కొన్నారు. బీజేపీ టూరిస్టులు హైదరాబాద్ అందాలతో పాటు అభివృద్ధిని చూడాలని ఆ పార్టీ నేతలనుద్దేశించి అన్నారు. దేశ రాజకీయాల్లో టీఆరెస్ కీలక పాత్ర పోషించనుందని’’ తలసాని పేర్కొన్నారు.

 బీజేపీవి చిల్లర రాజకీయాలు

   ‘‘గతంలో రామ్‌నాథ్ కొవింద్‌కు ఘనంగా స్వాగతం పలికాం. ఆనాడు, ఈనాడు మాలో ఏ మార్పు లేదు. చిల్లర రాజకీయాలు బీజేపీ వాళ్లు చేస్తారు. మేం కాదు. పెరేడ్ గ్రౌండ్‌లో  మేం మీటింగ్ పెట్టుకుంటాం అంటే ఆర్మీ స్థలం.. అనుమతి ఇవ్వం అన్నారు. ఆనాడు ఆర్మీ అడ్డు వచ్చింది. ఇవాళ ఏ అడ్డంకులు లేవా? అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు నిజాలు తెలియజేయడం కోసమే టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కనపరుస్తూ ఫ్లెక్సీలు, బోర్డులు  పెట్టాం’’ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-01T22:17:59+05:30 IST