చెత్తకుప్పలో కాలిన యువకుడి మృతదేహం

ABN , First Publish Date - 2021-02-28T05:34:47+05:30 IST

పదహారో నంబరు జాతీయరహదారి పక్కన మండలంలోని బోయపాలెం సమీపంలో చెత్తకుప్పలో సగం కాలిన యువకుడి మృతదేహం శనివారం ఉదయం వెలుగుచూసింది.

చెత్తకుప్పలో కాలిన యువకుడి మృతదేహం
మృతదేహాన్ని పరిశీలిస్తున్న నరసరావుపేట డీఎస్‌పి విజయభాస్కర్‌, రూరల్‌ సీఐ సుబ్బారావు

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 

యడ్లపాడు, ఫిబ్రవరి 27: పదహారో నంబరు జాతీయరహదారి పక్కన మండలంలోని బోయపాలెం సమీపంలో చెత్తకుప్పలో సగం కాలిన యువకుడి మృతదేహం శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి... హైవే పక్కన చెత్త మధ్యన మృతదేహాన్ని శనివారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నరసరావుపేట డీఎస్పీ సీహెచ్‌ విజయ్‌భాస్కర్‌, చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ శ్రీహరి మృతదేహాన్ని పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించారు. మృతుడి వయస్సు సుమారు 25-30 సంవత్సరాల మధ్య ఉంటుందని, చుట్టుపక్కల లభ్యమైన వస్తువుల ఆధారంగా మృతుడు సమీప ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. మృతునికి సంబంధించి వివరాలు తెలిసినట్లయితే 9440796268, 94404796256 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

Updated Date - 2021-02-28T05:34:47+05:30 IST