వైసీపీకి అనుకూలంగా ప్రచారంలో టీటీడీ ఉద్యోగులు
ABN , First Publish Date - 2021-03-07T14:01:02+05:30 IST
వైసీపీకి అనుకూలంగా ప్రచారంలో టీటీడీ ఉద్యోగులు
తిరుపతి: వినాయకనగర్ క్వార్టర్స్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారంలో టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన 41వ డివిజన్ వైసీపీ అభ్యర్థి స్రవంతితో పాటు టీటీడీ ఉద్యోగులు ప్రచారం చేయటంపై సహోద్యోగుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. టీటీడీ ఉద్యోగులు మీడియాకు సమాచారమిచ్చారు. దాంతో ప్రచారం జరుగుతున్న వినాయకనగర్కు మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. మీడియాను చూసి వైసీపీ అభ్యర్థి స్రవంతి, టీటీడీ ఉద్యోగులు వెళ్లిపోయారు.