వైసీపీ కోసం రూ. 30 లక్షలు నష్టపోయా.. నాలా ఎవరూ మోసపోవద్దు: చిన్నా
ABN , First Publish Date - 2022-01-14T17:41:41+05:30 IST
జగన్ ప్రభుత్వంపై సాధారణ ప్రజల్లోనే కాదు.. సొంతపార్టీ క్యాడర్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గుంటూరు జిల్లా: జగన్ ప్రభుత్వంపై సాధారణ ప్రజల్లోనే కాదు.. సొంతపార్టీ క్యాడర్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీని నమ్ముకున్నందుకు ఎంతగా నష్టపోయామో బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి గెలిపిస్తే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా, అమరావతి మండలం, మల్లాది గ్రామానికి చెందిన దళిత నేత చిన్నా.. పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కోసం తాను రూ. 30 లక్షలు నష్టపోయానని, తనలా ఎవరూ మోసపోవద్దని కోరుతున్నారు. పదేళ్లుగా పార్టీనే నమ్ముకున్న తనలాంటివారిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ‘మనకూ టైమ్ వస్తుంది.. అప్పుడు మనమేంటో చూపుదామంటూ’ అసంతృప్తులకు సూచించారు. చిన్నా సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.