మందుబాబులను ఆకట్టుకుంటున్న వైసీపీ, బీజేపీ: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-12-31T23:27:21+05:30 IST

మందుబాబులను వైసీపీ, బీజేపీ ఆకట్టుకుంటున్నాయని సీపీఐ రామకృష్ణ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

మందుబాబులను ఆకట్టుకుంటున్న వైసీపీ, బీజేపీ: రామకృష్ణ

అమరావతి: మందుబాబులను వైసీపీ, బీజేపీ ఆకట్టుకుంటున్నాయని సీపీఐ రామకృష్ణ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70కే అమ్మిస్తామంటూ సారాయి వీర్రాజు మేనిఫెస్టోలో పెడతామంటున్నారని విమర్శించారు. రెండున్నరేళ్లు సొంత బ్రాండ్‌లు అమ్మిన జగన్‌రెడ్డి సర్కార్‌.. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లు అమ్ముతామంటోందని ధ్వజమెత్తారు. మందుబాబుల ఓట్లు కొల్లగొట్టేందుకు వైసీపీ, బీజేపీలు పథక రచనలు చేస్తున్నాయని ఆరోపించారు. మద్య నిషేధం హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని రామకృష్ణ దుయ్యబట్టారు.

Updated Date - 2021-12-31T23:27:21+05:30 IST