వైసీపీలో బైరెడ్డి కలకలం

ABN , First Publish Date - 2022-04-20T22:34:43+05:30 IST

కర్నూలు వైసీపీలో ఆ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి కలకలం రేపుతున్నారు. జిల్లా వైసీపీ నేతలతో సిద్ధార్థ్ రెడ్డికి కొంతకాలంగా గ్యాప్ వచ్చింది. సిద్ధార్థ్ రెడ్డిని మొదటినుంచి

వైసీపీలో బైరెడ్డి కలకలం

కర్నూలు: కర్నూలు వైసీపీలో ఆ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి కలకలం రేపుతున్నారు. జిల్లా వైసీపీ నేతలతో సిద్ధార్థ్ రెడ్డికి కొంతకాలంగా గ్యాప్ వచ్చింది. సిద్ధార్థ్ రెడ్డిని మొదటినుంచి జిల్లా ముఖ్యనేతలు వ్యతిరేకిస్తున్నారు. సిద్ధార్థ్ రెడ్డి వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఆరా తీస్తోంది. అయితే సిద్ధార్థ్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీ నేత నారా లోకేష్‌ను కలిశారని త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని సిద్ధార్థ్ రెడ్డి కొట్టిపారేశారు. పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఇది కావాలని కొంతమంది చేస్తున్న కుట్ర చేస్తున్నారని, కుట్ర చేస్తున్నది ఎవరో తొందరలోనే బయటపడుతుందని సిద్ధార్థ్‌రెడ్డి తెలిపారు. 


కర్నూలు వైసీపీలో సిద్ధార్థరెడ్డి ప్రకంపనలు రేపుతున్నారు. కొంతకాలంగా బైరెడ్డి సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. నందికొట్కూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్ధర్‌తో ఆయనకు విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీ వీడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల లోకేష్‌తో సమావేశమయ్యాడంటూ.. వైసీపీ అధిష్టానం దృష్టికి బైరెడ్డి వ్యతిరేక వర్గం తీసుకెళ్లింది. అయితే ఈ ప్రచారాన్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం కొట్టిపారేస్తోంది.

Updated Date - 2022-04-20T22:34:43+05:30 IST