మంత్రివర్గ కూర్పుపై వైసీపీలో అసంతృప్తి

ABN , First Publish Date - 2022-04-10T23:22:29+05:30 IST

మంత్రివర్గ కూర్పుపై కృష్ణా జిల్లా వైసీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజకీయాలకు కేంద్ర బిందువైన కృష్ణా జిల్లాకు అన్యాయం జరిగిందని నేతలు వాపోతున్నారు.

మంత్రివర్గ కూర్పుపై వైసీపీలో అసంతృప్తి

విజయవాడ: మంత్రివర్గ కూర్పుపై కృష్ణా జిల్లా వైసీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజకీయాలకు కేంద్ర బిందువైన కృష్ణా జిల్లాకు అన్యాయం జరిగిందని నేతలు వాపోతున్నారు. పెడన నియోజకవర్గానికి చెందని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో మంత్రి పదవి ఊసేలేదు. దీంతో ఎన్టీఆర్‌ జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు డీలా పడిపడ్డారు. గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ ప్రజాప్రతినిధుల రాస్తారోకో చేశారు. మున్సిపల్ చైర్మన్ కిశోర్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-04-10T23:22:29+05:30 IST