వైసీపీ టికెట్‌ ఇస్తామని మోసం చేశారు

ABN , First Publish Date - 2021-03-01T08:52:09+05:30 IST

విజయవాడ 30వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థికి వైసీపీ షాక్‌ ఇచ్చింది. ఈ డివిజన్‌ నుంచి మూర్తి శ్రీమహావిష్ణు పార్టీ అభ్యర్థిగా గతంలో నామినేషన్‌ వేశారు.

వైసీపీ టికెట్‌ ఇస్తామని మోసం చేశారు

విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్‌), ఫిబ్రవరి 28: విజయవాడ 30వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థికి వైసీపీ షాక్‌ ఇచ్చింది. ఈ డివిజన్‌ నుంచి మూర్తి శ్రీమహావిష్ణు పార్టీ అభ్యర్థిగా గతంలో నామినేషన్‌ వేశారు. ఆయన కరోనాతో చనిపోవడంతో ఆయన వదిన సుధారాణిని పార్టీ అభ్యర్థినిగా తెరపైకి తెచ్చారు. తీరా కొత్తగా నామినేషన్లు దాఖలు చేసే సమయానికి  జానారెడ్డి అనే వ్యక్తిని తెరపైకి తెచ్చారు. దీనిపై సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆదివారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. పార్టీకి విధేయులుగా ఉన్న తమను మోసం చేశారని ఆరోపించారు. జానారెడ్డి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Updated Date - 2021-03-01T08:52:09+05:30 IST