రైతులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-07-24T06:30:08+05:30 IST
రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులను వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యా యం చేస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్య క్షుడు పీవీ.కృష్ణారెడ్డి ఆరోపించారు.
కిసాన్మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 23 : రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులను వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యా యం చేస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్య క్షుడు పీవీ.కృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఒంగో లులోని స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూక్ష్మసేద్యం పూర్తిగా నిర్వీర్యం చేశారని, కేంద్రం రూ.1028 కోట్లు మంజూరు చేస్తే ఆ మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం సొం త పథకాలకు మళ్ళించడం దుర్మార్గంగా ఉందన్నారు. ఫసల్ బీమా యోజన పథకంతో పాటు అవసరమైన యంత్రాలను కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని వి మర్శించారు. కేంద్రం అనేక విధాలుగా సహకారం అం దిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి బొంతల కృష్ణ, టుబాకో సెల్ రాష్ట్ర కన్వీనర్ సుబ్బారావు, వరప్రసాద్, వీరరాఘవరెడ్డి పాల్గొన్నారు.