AP: గుంతలకు YCP రంగులతో ముగ్గులు వేసిన Janasena leaders

ABN , First Publish Date - 2022-07-17T20:12:24+05:30 IST

తాడేపల్లి మండలం, పాతూరు ప్రధాన రహదారిపై జనసేన నేతలు వినూత్న నిరసన చేపట్టారు.

AP: గుంతలకు YCP రంగులతో ముగ్గులు వేసిన Janasena leaders

అమరావతి (Amaravathi): తాడేపల్లి మండలం, పాతూరు ప్రధాన రహదారిపై జనసేన నేతలు (Janasena leaders) వినూత్న నిరసన (Innovative protest) చేపట్టారు. అనేక గ్రామాలను కలిపే పాతూరు ప్రధాన రహదారిపై ఉన్న గుంతలకు వైసీపీ రంగుల (YCP colors)తో ముగ్గులు వేశారు. హ్యాష్‌ ట్యాగ్ గుడ్‌ (Hash tag) మార్నింగ్‌ సిఎం సార్‌ (Good morning sir) అంటూ ముఖ్యమంత్రిని నిద్ర లేపుతున్నామని జనసేన నేతలు చిల్లపల్లి శ్రీనివాస్ ఇతర నేతలు, కార్యకర్తలు అన్నారు. ‘‘ప్రభుత్వ భవనాలకు మీరు వైసీపీ రంగులు వేశారు.... కోర్టులు మొట్టికాయలు వేశాయి....మేము జనసేన నేతలుగా రోడ్లకు వైసీపీ రంగులు వేస్తున్నాం... ఈ రోడ్లను బాగుచేస్తే మిమ్మల్ని నిందించం.. సన్మానం చేస్తాం.. సీఎం నివాసం తాడేపల్లి ప్యాలెస్‌కు అర కిలో మీటర్‌ దూరంలో ఉన్న ఈ రోడ్డు పరిస్థితి చూడండి సిఎం సార్‌’’.. అంటూ నిరసన తెలిపారు.

Updated Date - 2022-07-17T20:12:24+05:30 IST