వాస్తవాలు కప్పిపుచ్చడానికే వైసీపీ ఎదురుదాడి

ABN , First Publish Date - 2022-05-22T06:33:35+05:30 IST

కాకినాడ ఘటనపై టీడీపీ నిజనిర్ధారణకమిటీ సభ్యులు పర్యటిస్తే, వాస్తవాలు బయటపడతాయనే వైసీపీ నాయకులు ఎ దురుదాడి చేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న విమర్శించారు.

వాస్తవాలు కప్పిపుచ్చడానికే వైసీపీ ఎదురుదాడి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న

మాజీ ఎమ్మెల్యే ఈరన్న


మడకశిర టౌన, మే 21: కాకినాడ ఘటనపై టీడీపీ నిజనిర్ధారణకమిటీ సభ్యులు పర్యటిస్తే, వాస్తవాలు బయటపడతాయనే వైసీపీ నాయకులు ఎ దురుదాడి చేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతిపట్ల పలు అనుమానాలు ఉన్నాయన్నారు. హత్యా?, రోడ్డు ప్రమాదమా? వాస్తవాలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పా ర్టీ  నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వెళ్లారన్నారు. వైసీపీ నాయకులు అడ్డగించి దాడులకు దిగడం చూస్తుంటే, వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంద న్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగకపోగా, దోషులపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవ న్నారు. అభివృద్ధిని విస్మరించి, కక్షతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సుబ్రహ్మణ్యం మృతిపై వాస్తవాలు బయటకు తీసి, దోషులను కఠినం గా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2022-05-22T06:33:35+05:30 IST