వైసీపీ విధానాలతో రాజ్యాంగ సంక్షోభం

ABN , First Publish Date - 2021-01-24T05:50:39+05:30 IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలతో రాజ్యాంగం సంక్షోభంలో పడింద ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కా ర్యదర్శులు కామరాజుగడ్డ కుసు మకుమారి, సాయినాఽథ్‌శర్మ ఆరో పించారు.

వైసీపీ విధానాలతో రాజ్యాంగ సంక్షోభం
మాట్లాడుతున్న కుసుమకుమారి

ఒంగోలు (కార్పొరేషన్‌) జనవ రి 23 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలతో రాజ్యాంగం సంక్షోభంలో పడింద ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కా ర్యదర్శులు కామరాజుగడ్డ కుసు మకుమారి, సాయినాఽథ్‌శర్మ ఆరో పించారు. శనివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తు న్న తీరు చాలా విమర్శనాత్మకంగా ఉందన్నారు. ఉద్యోగస్థులను, ప్రభుత్వం రెచ్చగొట్టి సమ్మె నోటీసులు చూపించి, ఎన్నికలు అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పేరుతో ఎన్నికలు నిలిపివేయా లని చూస్తున్న ప్రభుత్వం, ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.


Updated Date - 2021-01-24T05:50:39+05:30 IST