టీడీపీ శ్రేణులపై వైసీపీ కక్ష సాధింపు
ABN , First Publish Date - 2022-01-13T21:23:32+05:30 IST
జిల్లాలోని కుప్పంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కక్ష సాధింపు
చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. టీడీపీ నేత గోపీనాథ్కు చెందిన మెడికల్ షాప్ను అధికారులు మూసివేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మెడికల్ షాప్ యజమాని కుమారుడు టీడీపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. తన కుమారుడు పోటీలో దిగడం జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు ఒత్తిడి చేసి తన షాపుని సీజ్ చేయించారంటూ బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.