రాజ్యాంగమంటే వైసీపీకి లెక్కలేదు
ABN , First Publish Date - 2021-01-24T05:34:17+05:30 IST
రాజ్యాంగాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
ఓటమి భయంతోనే ఎన్నికల నిర్వహణకు వెనకడుగు
ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 23 : రాజ్యాంగాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల విషయమై వైసీపీ ప్రభుత్వానికి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా.. సిగ్గు లేకుండా ఇంకా సుప్రీం కోర్టుకి వెళ్లింది. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు జగన్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. ఇందుకోసమే ఎన్నికలను వాయిదా వేయాలని పట్టుబడుతుంది. హైకోర్టు తీర్పు జగన్కు చెంపపెట్టు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఈ ఎన్నికలు టీడీపీకి ఒక మంచి అవకాశం. గ్రామస్థాయిలో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తాం. ఎన్నికల కమిషన్కు కులాన్ని ఆపాదించడం దారుణం.’ అని ఎంపీ రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.