పాఠశాల ఆవరణలో వైసీపీ జెండా ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-03-13T00:27:51+05:30 IST
పాఠశాల ఆవరణలో వైసీపీ జెండాను ఆవిష్కరించిన సంఘటన
శ్రీకాకుళం: పాఠశాల ఆవరణలో వైసీపీ జెండాను ఆవిష్కరించిన సంఘటన జిల్లాలో జరిగింది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెళియాపుట్టి మండలం కొత్త మారడికోట గ్రామ పాఠశాలలో ఆ పార్టీ జెండాను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. సాధారణంగా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. కానీ పార్టీ ఆవిర్భావం రోజున దిమ్మపై వైసీపీ జెండాను ఆవిష్కరించడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.