పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు టీడీపీలోకి..

ABN , First Publish Date - 2022-06-06T00:21:09+05:30 IST

Cadapa: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరాయి. వేంపల్లె పట్టణంలో టీడీపీ

పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు టీడీపీలోకి..

Kadapa: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరాయి. వేంపల్లె పట్టణంలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సమక్షంలో 15 మంది టీడీపీలో చేశారు. పార్టీలో చేరిన వారిలో అన్నాడీఎంకే జిల్లా అధ్యక్షుడు రామచంద్ర  కుటుంబ సభ్యులతోపాటు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. వారికి రవి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ.. టీడీపీ మహానాడు విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తలకు జోష్ వచ్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న ఎన్నికలలో పులివెందులలో గెలిచి తీరుతామన్నారు. మూడు సంవత్సరాల నుంచి డ్రిప్ పరికరాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వాటిని ఎప్పుడు ఇస్తారో ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో 90 శాతం సబ్సిడీతో చంద్రబాబునాయుడు 10 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలు ఇచ్చారని గుర్తు చేశారు.  

Updated Date - 2022-06-06T00:21:09+05:30 IST