వైసీపీలో ముదురుతున్న వర్గపోరు

ABN , First Publish Date - 2022-04-18T21:53:17+05:30 IST

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ మధ్య మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. అధిష్ఠానం మందలించిన ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదు.

వైసీపీలో ముదురుతున్న వర్గపోరు

నెల్లూరు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ మధ్య మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. అధిష్ఠానం మందలించిన ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదు. మంత్రి కాకాణిని రెచ్చగొట్టేలా మాజీమంత్రి అనిల్ వ్యవహారం ఉంది. 20 కార్లతో అనిల్ సర్వేపల్లిలో హల్‌చల్‌ చేశారు. ఏడాది క్రితం మృతిచెందిన బంధువు కుటుంబ సభ్యులకు అనిల్ పరామర్శించడానికి వచ్చారు. సర్వేపల్లిలో తన సామాజికవర్గం, బంధువులను‌ కూడగట్టే ప్రయత్నం అనిల్ చేస్తున్నారు. ఊర్లలో‌ టపాసులు‌ పేలుస్తూ అనిల్ అనుచరులు హంగామా సృష్టించారు.  అనంతరం గంగమ్మ గుడిలో‌ అనిల్ పూజలు చేశారు. ఆయన తీరుపై‌ పార్టీ‌ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. అనిల్ కులాలవారీగా పార్టీని విభజిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

Updated Date - 2022-04-18T21:53:17+05:30 IST