వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన అచ్చెన్న

ABN , First Publish Date - 2022-07-09T20:49:09+05:30 IST

వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. 56 కార్పొరేషన్లతో మూడేళ్లలో ఖర్చు చేసిందెంత? అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన అచ్చెన్న

అమరావతి: వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. 56 కార్పొరేషన్లతో మూడేళ్లలో ఖర్చు చేసిందెంత? అని ప్రశ్నించారు. శనివారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించడం సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ ద్వారా మూడేళ్లలో ఖర్చు చేసిందెంత అని నిలదీశారు. 11,500 ఎకరాల అసైన్డ్‌ భూములు లాక్కొవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబు కాఫీ తోట పెంచితే.. జగన్‌ గంజాయి తోట పెంచారని దుయ్యబట్టారు. మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483 కోట్లు మళ్లింపు నిజం కాదా? అని మరోసారి ప్రశ్నించారు. 10 మందికి పదవులిచ్చి వేలమందిని చంపడం సామాజిక న్యాయమా? అని అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు.


Updated Date - 2022-07-09T20:49:09+05:30 IST