వైసీపీలో వర్గ విభేదాలు.. కడప జిల్లాలో మరీ ఇంతనా?

ABN , First Publish Date - 2022-01-13T23:35:30+05:30 IST

రాజంపేట అధికార వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డిపై..

వైసీపీలో వర్గ విభేదాలు.. కడప జిల్లాలో మరీ ఇంతనా?

కడప: రాజంపేట అధికార వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డిపై వైసీపీ నేత రాఘవేంద్ర వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయనమ్మ సమాధి మండపాన్ని నిర్మిస్తుండగా ఎమ్మెల్యే, తన అనుచరులు, అధికారులతో రాత్రికి రాత్రి కూల్చి వేసేలా చేశారన్నారు. రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి ఎమ్మెల్యే తన అనుచరులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వేధిస్తున్నారని వైసీపీ నేత రాఘవేంద్ర వర్మ ఆరోపించారు. ఎమ్మెల్యే మల్లిఖార్జున రెడ్డి దౌర్జన్యాలు అడ్డుకోవాలని సీఎం జగన్‌కు వైసీపీ నేత రాఘవేంద్ర వర్మ విజ్ఞప్తి చేశారు.



Updated Date - 2022-01-13T23:35:30+05:30 IST