చంద్రబాబు సభలో వైసీపీ కార్యకర్త హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-10-29T22:58:54+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు సభలో వైసీపీ కార్యకర్త హల్‌చల్‌ సృష్టించారు. రాళ్లు, కర్రలతో ఓ వైసీపీ కార్యకర్త వచ్చాడు

చంద్రబాబు సభలో వైసీపీ కార్యకర్త హల్‌చల్‌

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు సభలో వైసీపీ కార్యకర్త హల్‌చల్‌ సృష్టించారు. రాళ్లు, కర్రలతో ఓ వైసీపీ కార్యకర్త వచ్చాడు. దీంతో బాంబు తెచ్చారంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన చెందారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే ఆయనపై బాంబు వేస్తాని వైసీపీ నేత సెంధిల్ కుమార్ హెచ్చరించడంతో అందరూ భయపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నినాదాలు చేశాయి. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఫ్లెక్సీల చించివేతకు ప్రతీకారంగా వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేశారు. ఆర్అండ్‌బీ రోడ్‌ నుంచి కుప్పంలోకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను టీడీపీ శ్రేణులు చించివేశాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.


చంద్రబాబు కుప్పం పర్యటనకు వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. చంద్రబాబు బస చేసే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కి పవర్ కట్ చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ జనరేటర్ ఏర్పాటు చేసినట్లుగా తెలియవచ్చింది. దీనిపై విద్యుత్ అధికారులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ విద్యుత్ ఉందని, అయితే ప్రత్యామ్నాంగా జనరేటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గెస్ట్ హౌస్‌‌కు విద్యుత్ లేదనేది పుకార్లు మాత్రమేనని ఇలాంటి అవాస్తవాలు చెప్పినవారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ సిబ్బంది డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-29T22:58:54+05:30 IST