అనంతపురంలో వైసీపీ నేతల ఆగడాలకు రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-03-29T23:06:32+05:30 IST

అనంతపురంలో వైసీపీ నేతల ఆగడాలకు రైతు ఆత్మహత్యాయత్నం

అనంతపురంలో వైసీపీ నేతల ఆగడాలకు రైతు ఆత్మహత్యాయత్నం

అనంతపురం: ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చివరికి వైసీపీ దౌర్జన్యాలతో ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నేతలకు తోడుగా పోలీసులు వత్తాసు పలుకుతూ ఉండటం విస్మయాన్ని గురి చేస్తోంది. జిల్లాలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. వైసీపీ నేతల దౌర్జన్యాలకు కిష్టయ్య అనే రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. 


ధర్మవరం ఎమ్మెల్యే అనుచరుడు లక్ష్మీరెడ్డి తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కిష్టయ్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 40 ఏళ్లుగా తన పొలంలో సాగు చేసుకుంటున్నానని చెప్పారు. తన భూమికి పట్టా కూడా ఉందన్నారు. భూమిపై వైసీపీ నేతల కన్ను పడింది. దానికి తోడు అధికారం చేతిలో ఉంది. 


ఇక వారి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. రైతుకు సంబంధించిన సదరు భూమిలో రెండున్నర ఎకరాలు తనకు వస్తుందని లక్ష్మీరెడ్డి చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసుల అండతో ఆ పంట పొలాల్లో రాళ్లను కూడా పాతారు. మనస్థాపానికి గురైన రైతు కిష్టయ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు సర్వే చేయించి భూమి కబ్జా చేశాడని కిష్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-03-29T23:06:32+05:30 IST