వైసీపీ నేత రొయ్యల అక్రమ సాగు కట్టల తొలగింపు

ABN , First Publish Date - 2022-07-08T04:14:20+05:30 IST

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మత్స్య శాఖ అధికారులు గురువారం మండలంలోని నిడిగుంటపాళెం గ్రామానికి చెందిన వైసీపీ నేత కట్టంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రొయ్యల అక్రమ సాగు చెరువు అక్రమ కట్లను తొలగించారు.

వైసీపీ నేత రొయ్యల అక్రమ సాగు కట్టల తొలగింపు
రొయ్యల సాగు చెరువు కట్లను తొలగిస్తున్న జేసీబీ

 హైకోర్టు ఉత్తర్వులతో మత్స్యశాఖ చర్యలు

వెంకటాచలం, జూలై 7 : హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మత్స్య శాఖ అధికారులు గురువారం మండలంలోని నిడిగుంటపాళెం గ్రామానికి చెందిన వైసీపీ నేత కట్టంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రొయ్యల అక్రమ సాగు చెరువు అక్రమ కట్లను తొలగించారు. శ్రీధర్‌రెడ్డి మత్స్య శాఖ అనుమతులు లేకుండా చుక్కల భూమిలో అక్రమంగా రొయ్యల సాగు చేస్తుండడంతో పక్కన ఉన్న తమ వరి పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు జిల్లా మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో ఆ గ్రామానికి చెందిన రైతు నాన్నం ఏడు కొండలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూమిలో రొయ్యల సాగు నిషేధమని హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌4న ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా అధికారులు వాటిని అమలు చేయకపోవడంతో ఆధారాల సహా ఏడుకొండలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు బుధవారం ఇచ్చిన ఉత్తర్వులతో  కలెక్టర్‌ ఆదేశాలు ఇవ్వడంతో మత్స్యశాఖ ఏడీ ప్రసాద్‌ పోలీసు బందోబస్తుతో ఆ రొయ్యల సాగు చెరువు కట్లను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు.


Updated Date - 2022-07-08T04:14:20+05:30 IST