సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నాయకుడి దాడి
ABN , First Publish Date - 2022-05-01T01:46:22+05:30 IST
జిల్లాలోని నంద్యాల 38వ వార్డు సచివాలయం ఉద్యోగిపై
నంద్యాల: జిల్లాలోని నంద్యాల 38వ వార్డు సచివాలయం ఉద్యోగిపై వైసీపీ నాయకుడు శివ దాడి చేశాడు. తాను చెప్పిన పనులు ఎందుకు చేయ్యడం లేదని ఉద్యోగి సుధాకర్పై సదరు నాయకుడు దాడికి పాల్పడ్డాడు. దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద సచివాలయం ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉద్యోగిపై దాడి విషయాన్ని కలెక్టరు మనజీర్ జిలాని దృష్టికి సచివాలయం ఉద్యోగులు తీసుకెళ్లారు.