పోలీసుల అదుపులో వైసీపీ నేత

ABN , First Publish Date - 2022-01-06T02:43:39+05:30 IST

వైసీపీ నేత కొండ్రెడ్డిని తంబళ్లపల్లి పోలీసులు

పోలీసుల అదుపులో వైసీపీ నేత

చిత్తూరు: వైసీపీ నేత కొండ్రెడ్డిని తంబళ్లపల్లి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.  దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఫోర్జరీ కేసుకు సంబంధించి పలు అంశాలపై ఆయనను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.


ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కొండ్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వారం క్రితం తిరుపతిలో ద్వారకనాథరెడ్డిపై కొండ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సంఘటన తరువాత వెను వెంటనే కొండ్రెడ్డిపై పాత కేసులను పోలీసులు తిరగతోడారు. మూడ్రోజుల క్రితం తంబళ్లపల్లె తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ కేసులో కొండ్రెడ్డిని అరెస్ట్ చేసి మదనపల్లె సబ్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే ఈ కేసులో ఇంకా విచారణ చేయాలని తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండ్రెడ్డిని ఒకరోజు కస్టడీకి అనుమతిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కొండ్రెడ్డి లాయర్ సమక్షంలోనే విచారణ చేపట్టాలని షరతులు విధించింది. ఫోర్జరీ కేసుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.

 

Updated Date - 2022-01-06T02:43:39+05:30 IST