అనంతపురం జిల్లాలో మితిమీరిపోతున్న వైసీపీ నేతల ఆగడాలు
ABN , First Publish Date - 2021-09-01T00:39:32+05:30 IST
కదిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి ప్రభుత్వ అధికారుల వరకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారు.
అనంతపురం: కదిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి ప్రభుత్వ అధికారుల వరకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారు. కదిరి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు మితిమీరిపోతున్నాయి. రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక తలపుల మండల అధికారులు సామూహిక సెలవులు పెట్టారు. రేపటి నుంచి సామూహిక సెలవు దరఖాస్తు కోరుతూ జిల్లా పరిషత్ సీఈవోకు ఎంపీడీవో లేఖ రాశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మండలంలో పనిచేయలేకపోతున్నామంటూ దరఖాస్తులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పై అధికారులు వైసీపీ నేతల ఆగడాలను కట్టడి చేయాలని కదిరి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.