వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు: Chandra Babu
ABN , First Publish Date - 2022-07-23T01:27:56+05:30 IST
పశ్చిమ గోదావరి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ట్వీట్పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ప్రవాహంగా ఎక్కువగా
పశ్చిమ గోదావరి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి (Vijaya sai) ట్వీట్పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) స్పందించారు. వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ప్రవాహంగా ఎక్కువగా ఉంటే.. ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉండేదన్నారు. కొందరు పోలీసుల అత్యుత్సాహంతో తమ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. వరద బాధితుల కోసం ఇప్పటి వరకు రాజకీయం చేయలేదని పేర్కొన్నారు. నేతలు కల్పించుకుంటేనే బాధితుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించారు. కోనసీమ జిల్లా పర్యటనలో ఆయన ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా.. అకస్మత్తుగా నీటిలో పడిపోయారు. ప్రమాద సమయంలో లాంచీలో చంద్రబాబుతో పాటు సుమారు 15 మంది ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు నీటిలో తడిసిపోయారు.