Gunturలో ధూళిపాళ్లను అడ్డుకున్న వైసీపీ నేతలు...ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-05-24T17:15:25+05:30 IST

జిల్లాలోని చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెరువులో వైసీపీ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టింది.

Gunturలో ధూళిపాళ్లను అడ్డుకున్న వైసీపీ నేతలు...ఉద్రిక్తం

గుంటూరు: జిల్లాలోని చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెరువులో వైసీపీ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టింది. తవ్వకాల విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla narendra) చెరువు వద్దకు వచ్చారు. దీంతో ధూళిపాళ్లను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేశారంటూ గగ్గోలు పెట్టారు. దీంతో వైసీపీ - టీడీపీ  వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాటకు దారి తీసింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-05-24T17:15:25+05:30 IST