కుప్పంలో వైసీపీ నేతలు అరాచకలు
ABN , First Publish Date - 2021-11-14T21:32:24+05:30 IST
కుప్పంలో వైసీపీ నేతలు అరాచకలకు పాల్పడుతున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు స్థానికేతరులను తరలిస్తున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది.
చిత్తూరు: కుప్పంలో వైసీపీ నేతలు అరాచకలకు పాల్పడుతున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు స్థానికేతరులను తరలిస్తున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది. వైసీపీకి పోలీసులు, అధికారులు కొమ్ము కాస్తున్నారని టీడీపీ ధర్నాకు దిగారు. బయటి వ్యక్తులను కుప్పం నుంచి పంపకుండా టీడీపీ నేతలపైనే పోలీసులు జులుం చేస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో పరిస్థితిని సమీక్షిస్తోన్న టీడీపీ నేత అమర్నాథ్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
కుప్పంలో ఓటర్లకు స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ.. అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 23వ వార్డులో నాన్ లోకల్కు సంబంధించిన వ్యక్తులు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్,ఆయన తల్లి మాజీ ఎంపీటీసీపై స్థానికేతర వైసీపీ ప్రచార వ్యక్తులు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.