టీడీపీ ఓడినా, గెలిచినా దాడులకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నేతల ఆదేశాలట...

ABN , First Publish Date - 2021-11-23T17:39:27+05:30 IST

కొండపల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కొండపల్లి ఇబ్రహీంపట్నంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జోగి రమేష్ మకాం వేశారు.

టీడీపీ ఓడినా, గెలిచినా దాడులకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నేతల ఆదేశాలట...

విజయవాడ: కొండపల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కొండపల్లి ఇబ్రహీంపట్నంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జోగి రమేష్ మకాం వేశారు. టీడీపీ శ్రేణుల మీద దాడులు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇబ్రహీంపట్నంలో వాహనాల్లో కర్రలు వేసుకుని వైసీపీ నేతలు హల్ చల్ చేస్తున్నారు.
టీడీపీ ఓడినా.. గెలిచినా దాడులు చేసేందుకు సిద్ధం ఉండాలని వైసీపీ శ్రేణులకు నేతలు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికపై రేటెర్కింగ్ అధికారికి హై కోర్టు నుంచి సీల్డ్ కవర్‌లో సమాచారాన్ని ఎన్నికల అధికారి రహస్యంగా ఉంచారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.


Updated Date - 2021-11-23T17:39:27+05:30 IST