వైసీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారు: పీతల సుజాత

ABN , First Publish Date - 2021-09-18T22:05:50+05:30 IST

మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి పీతల సుజాత ప్రకటించారు.

వైసీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారు: పీతల సుజాత

జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి పీతల సుజాత ప్రకటించారు. ప్రతిపక్ష నేత ఇంటి దాడిచేయడం సిగ్గుచేటని తప్పుబట్టారు. వైసీపీకి ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తామని చెప్పిన వైసీపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక గుండాల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని సుజాత హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలపై లాఠీచార్జ్ చేయడం ఏమిటని సుజాత ప్రశ్నించారు.

Updated Date - 2021-09-18T22:05:50+05:30 IST