భీమ్లానాయక్ టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నా వైసీపీ నేతలు : బుద్ధప్రసాద్
ABN , First Publish Date - 2022-02-27T15:57:14+05:30 IST
భీమ్లానాయక్ సినిమా విషయంలో వైసీపీపై మండలి మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: భీమ్లానాయక్ సినిమా విషయంలో వైసీపీపై మండలి మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు సినిమా టికెట్లను బ్లాక్లో అమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం.. రెవెన్యూ సిబ్బందిని, పోలీసులను.. సినిమా థియేటర్ల దగ్గర గేటు కీపర్లను చేసిందని మండిపడ్డారు. ఇంతకంటే అవమానం మరొకటి లేదని చెప్పారు. బ్లాక్లో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముకున్నారని ఎగ్జిబిటర్లే చెబుతున్నారన్నారు. లిక్కర్, ఇసుక, మట్టి రవాణాను దాటి బ్లాక్ మార్కెట్ స్థాయికి.. వైసీపీ నేతలు, పెద్దలు దిగడం విస్మయాన్ని కలిగించిందని బుద్ధప్రసాద్ తెలిపారు.