Mla Bhumana Karunakar Reddy: దుర్మార్గుల మాటలు విని అన్యాయాలు చేసినందుకు క్షమాపణలు
ABN , First Publish Date - 2022-08-21T02:06:15+05:30 IST
నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సత్యశోధన (మహాత్మా గాంధీ జీవిత చరిత్ర)’ పుస్తక ఆవిష్కరణలో....
తిరుపతి: నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Ycp Mla Bhumana Karunakar Reddy) అన్నారు. సత్యశోధన (మహాత్మా గాంధీ జీవిత చరిత్ర)’ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన సీఎం జగన్ (Cm Jagan)పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తాను పదవుల కోసం తలవంచే వాడిని కాదని చెప్పుకున్నారు. రాజకీయాల్లో మార్పు రాకపోతే మానవజాతి మనుగడకే ప్రమాదని భూమన హెచ్చరించారు. దుర్మార్గుల మాటలు విని అన్యాయాలు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. పతనం చెందిన వ్యక్తికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Cji nv Ramana) సమక్షంలోనే భూమన కరుణాకర్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం తలవంచేవాడిని కాదని భూమన అన్నారు. దీంతో ఆయన మాటలు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.