AP News: మహిళపై ఎమ్మెల్యే Sai prasad వింత వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-05-24T15:35:11+05:30 IST
సమస్యలపై ప్రశ్నించిన ఓ మహిళపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వింత వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు: సమస్యలపై ప్రశ్నించిన ఓ మహిళపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వింత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆదోని బైచి గేరిలో గడప గడప కార్యక్రమంలో ఎమ్యెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమస్యలపై ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. ఓ మహిళ సమస్యపై ప్రశ్నిస్తే ‘‘నీ మొగుడు నీతో ఎట్లా ఏగుతున్నాడో’’ అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళలు అవాక్కయ్యారు.