అయ్యన్న తుగ్లక్‎లా మరిపోయాడు: ఉమా శంకర్

ABN , First Publish Date - 2022-01-23T03:13:21+05:30 IST

అధికారం కోల్పోవడంతో అయ్యన్న పిచ్చి వాడిలా తయారు అయ్యాడని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ విమర్శించారు. వైద్యం నిమిత్తం ఆయనను ...

అయ్యన్న తుగ్లక్‎లా మరిపోయాడు: ఉమా శంకర్

విశాఖ: అధికారం కోల్పోవడంతో అయ్యన్న పిచ్చి వాడిలా తయారు అయ్యాడని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ విమర్శించారు. వైద్యం నిమిత్తం ఆయనను మంచి ఆసుపత్రిలో చూపించాలని అయ్యన్న భార్య పద్మావతికి సూచించారాయన. సీఎం జగన్ పట్ల ప్రజల విశ్వాసాన్ని చూసి అయ్యన్నపాత్రుడు ఓర్వ లేకపోతున్నాడని మండిపడ్డారు. అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అధికారం రాదని గ్రహించాకే అయ్యన్న తుగ్లక్‎లా మరిపోయాడని ఎమ్మెల్యే ఉమా శంకర్ విమర్శించారు. 


Updated Date - 2022-01-23T03:13:21+05:30 IST