జగన్ అన్ని ఆలోచించే చేశారు: ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు
ABN , First Publish Date - 2022-04-27T16:45:51+05:30 IST
సీఎం జగన్ అన్ని ఆలోచించే కొత్త క్యాబినెట్ కూర్పు చేశారని వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు అన్నారు.
గుంటూరు: సీఎం జగన్ అన్ని ఆలోచించే కొత్త క్యాబినెట్ కూర్పు చేశారని వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్లో బీసీలు, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఒకరిద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సీఎం ఎన్నికలకు ముందు చెప్పిందే చేశారని అన్నారు. టీడీపీలో చేరతున్నానంటూ గతంలో ప్రచారం చేశారని, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై తానేమీ స్పందించనని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు స్పష్టం చేశారు.