ఎంపీ రఘురామ కంపెనీపై రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీల లేఖ
ABN , First Publish Date - 2021-07-24T03:09:57+05:30 IST
ఎంపీ రఘురామ కంపెనీపై రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీలు లేఖ రాసారు. ఇందు
ఢిల్లీ: ఎంపీ రఘురామ కంపెనీపై రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీలు లేఖ రాసారు. ఇందు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఫిర్యాదు చేశారు. ఇందు భారత్ కంపెనీ రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని ఎంపీలు పేర్కొన్నారు. తక్షణమే ఇందు భారత్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలన్నారు. మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలని ఆ లేఖలో వైసీపీ ఎంపీలు కోరారు.