వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు : జనసేన
ABN , First Publish Date - 2022-06-25T05:19:39+05:30 IST
వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారుకు ఓటమి తప్పదని జనసే న రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాం దాస్చౌదరి పేర్కొన్నారు.
మదనపల్లె క్రైం, జూన్ 24: వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారుకు ఓటమి తప్పదని జనసే న రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాం దాస్చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం మదన పల్లెలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే పథకాల ను రెండింతలు చేసి మైనారిటీల అభివృద్ధికి దోహదపడతామంటూ గత ఎన్నికల్లో జగన్ మోహన్రెడ్డి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక..పథకాలను తుంగలో తొక్కారని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, సంయుక్త కార్యదర్శి సనావుల్లాలు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం జనసేనతోనే సాధ్యమన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. కార్యక్రమంలో నాయకు లు అడపా సురేంద్ర, బాబు, రెడ్డెప్ప, నవీన్, కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.