వైసీపీకి ఓటమి తప్పదు: టీడీపీ

ABN , First Publish Date - 2022-06-27T05:37:36+05:30 IST

రాష్ట్ర ప్రజలను అఽథోగతిపాలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని టీడీపీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ రఫి అన్నారు.

వైసీపీకి ఓటమి తప్పదు: టీడీపీ
డోన్‌లో టీడీపీ సభ్యత్వాన్ని ఇస్తున్న టీడీపీ నాయకులు

డోన్‌, జూన్‌ 26: రాష్ట్ర ప్రజలను అథోగతిపాలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని టీడీపీ  పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ రఫి అన్నారు. పట్టణంలోని 6, 16, 17 వార్డులలో ఆదివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అబద్దాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మాజీ కౌన్సిలర్‌ గోపాల్‌, టీడీపీ నాయకులు దౌలా, అన్వర్‌, జీవన్‌, చంద్ర, మాబు హుశేన్‌, నాగరాజు, ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


బేతంచెర్ల: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర నాయక్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో టీడీపీ నాయకులు రామకృష్ణ, రాముడు, తిమ్మరాజు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. షేక్షావలి చౌదరి, శ్రీరాములు, శ్రీను, దేవరాజ్‌, రంగస్వామి, సత్యం, వెంకట్రాముడు పాల్గొన్నారు.


యంబాయి గ్రామంలో..


యంబాయి గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఉన్నం ఎల్ల నాగయ్య ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రనాయక్‌, 10వ వార్డు కౌన్సిలర్‌ రామాంజనేయులు, రైతు సంఘం కార్యదర్శి శశికుమార్‌, టీడీపీ నాయకులు కృష్ణుడు, వెంకట్రాముడు, మధుసూదన్‌, సురేష్‌, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-06-27T05:37:36+05:30 IST