రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు

ABN , First Publish Date - 2022-07-01T06:31:08+05:30 IST

భావి ప్రధాని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు జోస్యం చెప్పారు.

రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు
మాట్లాడుతున్న ఆళ్ళ నాని

వైసీపీ ప్లీనరీలో ఆళ్ల నాని ఆరోపణ

సమావేశం పూర్తికాకుండానే  మహిళల నిష్క్రమణ

నూజివీడు, జూన్‌ 30: భావి ప్రధాని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు జోస్యం చెప్పారు. గురువారం నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో  ఎంపీ కోటగిరి శ్రీధర్‌,  ఎమ్మెల్యేలు ఆళ్ళ నాని,  అబ్బయ్య చౌదరి  ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. ఆళ్ల నాని మాట్లాడుతూ  చంద్రబాబు తన  హయాంలో రైతు సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలన్నారు. కాగా సభా ప్రాంగణంలో వెలుగు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.  వెలుగు అధికారులు, వలంటీర్లు  మహిళల ఖాతాలో డబ్బు పడకపోతే తమను అడగవద్దని బెదిరింపులకు దిగడంతో పలువురు వెలుగు మహిళలు గత్యంతరం లేక ఈ కార్యక్రమానికి తరలివచ్చినట్టు తెలిసింది. అయితే కీలెరిగి వాత పెట్టిన  చందంగా ఎంపీ కోటగిరి  మహిళల విషయమై ప్రసంగిస్తున్న సమయంలోనే ప్లీనరీ ప్రాంగణం నుంచి మహిళలు సీట్లలో నుంచి లేచి వెళ్ళిపోవడం కనిపించింది. ఆపటానికి అక్కడే ఉన్న వలంటీర్లు ప్రయత్నించిన సందర్భంలో కనీసం తాగడానికి మంచినీరు కూడా సరఫరా చేయలేదు. మంచినీటి కోసం వెళుతున్నామంటూ సభా ప్రాంగణాన్ని విడిచి వెళ్ళిపోవడం కనిపించింది.



Updated Date - 2022-07-01T06:31:08+05:30 IST