Parvathipuram Ycpకి ప్లీనరీ సమావేశాల్లో నిరుత్సాహం
ABN , First Publish Date - 2022-07-01T03:10:50+05:30 IST
వైసీపీ (Ycp)కి ప్లీనరీ (Plenary) సమావేశాల్లో నిరుత్సాహం తప్పడంలేదు. మంత్రుల సభకు జనాలు కరవు అవుతున్నారు. తాజాగా పార్వతీపురం ...
పార్వతీపురం: వైసీపీ (Ycp)కి ప్లీనరీ (Plenary) సమావేశాల్లో నిరుత్సాహం తప్పడంలేదు. మంత్రుల సభకు జనాలు కరవు అవుతున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) స్థాయి ప్లీనరీ జనాలు లేక అట్టర్ ఫ్లాప్ అయింది. జిల్లా ఆవిర్భావం తర్వాత సత్తా చాటాలనుకున్న నేతల ఆశలపై నీళ్లు చల్లింది. పార్వతీ పురం జిల్లాలో జన సమీకరణ బాధ్యతను స్థానిక శాసన సభ్యుడు అలజంకి జోగారావు (Mla alajanki Jogarao) తీసుకున్నారు. జనాన్ని భారీగా తరలించారు. అయితే అది నీటి బుడగ్గానే మారిపోయింది. సమావేశం ఆరంభంలో ఉన్న జనాలు సగం వరకు కూడా ఉండలేదు.