రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం వైసీపీకి వచ్చింది: రఘురామ

ABN , First Publish Date - 2022-06-16T21:24:02+05:30 IST

మాట తప్పితే రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని సీఎం జగన్ అన్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు

రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం వైసీపీకి వచ్చింది: రఘురామ

ఢిల్లీ: మాట తప్పితే రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని సీఎం జగన్ అన్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంట పెట్టుబడికి రూ.12,500 ఇస్తామని రూ.7500 మాత్రమే ఇచ్చారని విమర్శించారు. రూ.4,500 కోట్లతో విపత్తు నిధి అన్నాం.. కానీ ఇవ్వలేదని తప్పుబట్టారు.  డాక్టర్ల సంఖ్య పెంచడమంటే వాచ్‌మెన్‌లతో వైద్యం చేయించడం కాదని పేర్కొన్నారు. మద్యనిషేధం అన్నారు.. మద్యం బాండ్లపై అప్పు తెచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం వైసీపీకి వచ్చిందని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-16T21:24:02+05:30 IST