AP News: వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారు: శైలజానాథ్
ABN , First Publish Date - 2022-08-20T20:38:47+05:30 IST
(YCP) వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath) ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతపురం: (YCP) వైసీపీ హయాంలో రైతులు దోపిడీకి గురవుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath) ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పాతూరు కూరగాయల మార్కెట్ను పరిశీలించి.. కూరగాయల ధరలను శైలజానాథ్ అడిగి తెలుసుకున్నారు. కొత్తిమీర కట్ట అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ (Petrol Diesel Gas) ధరల పెంపుతోనే నిత్యావసరాల ధరలు పెరిగాయని తెలిపారు. నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 4న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని శైలజానాథ్ ప్రకటించారు.