YCPని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలి: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2022-05-29T16:46:01+05:30 IST

YCPని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలి: బుద్దా వెంకన్న

YCPని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలి: బుద్దా వెంకన్న

విజయవాడ: మహానాడుకు మహాదరణ వచ్చిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. 2054 వరకు నారా కుటుంబం అధికారంలో ఉంటుందని, 2024 ఎన్నికల్లో YCP పూర్తిగా మునిగిపోవడం ఖాయమని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. వైసీపీని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలని బుద్దా వెంకన్న సూచించారు. జగన్, విజయసాయిరెడ్డి బొక్కలో ఉన్నప్పుడు వైసీపీని మూసేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్ తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పార్టీని నిలబెట్టారని, అధికారంలోకి వచ్చాక అదే తల్లి, చెల్లిని వెన్నుపోటు పొడిచారని వెంకన్న విమర్శించారు. మంత్రుల బస్సుయాత్రతో ప్రజలకేం ఉపయోగమని, జగన్, వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును చంద్రబాబు కక్కిస్తారని బుద్దా వెంకన్న తెలిపారు.

Updated Date - 2022-05-29T16:46:01+05:30 IST