స్టీల్ప్లాంట్, భోగాపురంపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదు: రామ్మోహన్
ABN , First Publish Date - 2022-04-06T20:18:47+05:30 IST
స్టీల్ప్లాంట్, భోగాపురంపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో
అమరావతి: స్టీల్ప్లాంట్, భోగాపురంపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతమంది సలహాదారులను పెట్టుకుని ఏం లాభమన్నారు. బాబాయ్ హత్య కేసు నుంచి కుటుంబ సభ్యుడిని తప్పించేందుకే జగన్, ఢిల్లీ పర్యటన చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఏం చర్చించారో సీఎం బయటపెట్టాలని రామ్మోహన్నాయుడు డిమాండ్ చేశారు.