కోర్టు కేసులతో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరు
ABN , First Publish Date - 2021-07-27T06:21:17+05:30 IST
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని కోర్టు కేసులతో అడ్డుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అయినా అడ్డుకోలేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని కోర్టు కేసులతో అడ్డుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అయినా అడ్డుకోలేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక మంగళవారం జరగనున్నందున, కార్పొరేటర్లకు ఓటుహక్కు వినియోగంపై మేఘాలయ హోటల్లో సోమవారం అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన మాట్లాడారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి పది మంది కార్పొరేటర్లను పోటీకి నిలుపుతున్నామని, అన్ని స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. విశాఖ అభివృద్ధికి దోహదపడే పరిపాలన రాజధాని రాకుండా చంద్రబాబు అడ్డుకుంటారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను తాము ప్రోత్సహించమని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాఽథ్, తిప్పల నాగిరె డ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొన్నారు.